India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,39,814 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,961 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,49,67,250కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్గా (Active Cases) ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,05,550 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,659కి ఎగబాకింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.07 శాతం యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.75 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,76,563 ) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Mumbai Traffic Cop | వాహనదారుల భద్రతకై రోడ్డుపై ఇసుక చల్లిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా
Gold State Coach: చార్లెస్ దంపతుల ఊరేగింపు ఈ స్వర్ణ రథంలోనే..
Sienna Weir | గుర్రపు స్వారీ చేస్తుండగా కిందపడి మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ మృతి