AAP : సార్వత్రిక ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాట్లను ఖరారు చేసి ప్రచార సమరభేరి మోగించేందుకు కసరత్తు సాగిస్తున్నాయి. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ, హరియాణ, గుజరాత్, పంజాబ్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్ధుల పేర్లను మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేజ్రీవాల్ నివాసంలో రేపు జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ అనంతరం ఎంపీ అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఢిల్లీలో సీట్ల సర్దుబాటుపై ఇండియా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలు ఆప్, కాంగ్రెస్ ఓ అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో ఆప్ నాలుగు స్ధానాల్లో పోటీ చేయనుండగా కాంగ్రెస్ మూడు స్ధానాల్లో బరిలో నిలవనుంది. ఢిల్లీతో పాటు హరియాణ, గుజరాత్, ఛండీఘఢ్,గోవాలోనూ సీట్ల సర్దుబాటును ఇరు పార్టీలు ఖరారు చేశాయి. ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్ధులపై ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో చర్చించి ఏకాభిప్రాయం వ్యక్తమైన స్ధానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించవచ్చని ఆప్ వర్గాలు వెల్లడించాయి.
Read More :
Mohan Babu | ఏపీ రాజకీయ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు.. ఎందుకంటే.?