కష్టకాలంలో ఆదుకున్న మహనీయుడు
ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నదీం
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కృష్ణకాలనీ, మే 30 : కష్టకాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రైవేట్ టీచర్లమంతా రుణపడి ఉంటామని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ నదీం అన్నారు. కరోనాతో ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్ల కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరణారెడ్డి చిత్రపటాలకు జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్సెంటర్లో ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నదీం మాట్లాడుతూ.. కొవిడ్తో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల కుటుంబాలు పడుతున్న కష్టాలు గుర్తించిన సీఎం కేసీఆర్ నెలకు రూ.2వేలు, 25కిలోల చొప్పున బియ్యం అందజేస్తూ ఆదుకుంటున్న మహనీయుడన్నారు. తమ కుటుంబాల పాలిట దేవుడని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల పిల్లలు ఉన్నత విద్యనభ్యసించాలనే ఆలోచనతో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టించి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లాలోని ప్రైవేటు టీచర్లందరికీ లబ్ధిచేకూరేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు బుర్ర కిరణ్, కృష్ణంరాజు, హైమావతి, భాగ్యలక్ష్మి, యోగేంద్ర, రవి, భాషా, భవ్య, రాజు పాల్గొన్నారు.