AAP | పంజాబ్ (Punjab)లో నాలుగు లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అభ్యర్థులను (candidates) ప్రకటించింది. నలుగురు సభ్యుల జాబితాను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఓ ఎమ్మెల్యేకు ఆప్ లోక్సభకు చోటు కల్పించింది. లూథియానా సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అశోక్ పరాశర్ పప్పిని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి లోక్సభ బరిలోకి దింపింది. ఆయన్ని లూథియానా నుంచే పోటీకి నిలబెట్టింది. ఇక ఫిరోజ్పూర్ నుంచి జగదీప్ సింగ్ కాకా బ్రార్, గురుదాస్పూర్ నుంచి అమన్షేర్ సింగ్ (షెరీ కల్సి), జలంధర్ నుంచి పవన్ కుమార్ టిను లోక్సభకు అభ్యర్థులుగా ప్రకటించింది.
పంజాబ్లో మొత్తం 13 పార్లమెంటరీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే 8 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థుల్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు. అమృత్సర్ నుంచి మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖద్దూర్ సాహిబ్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లార్, బఠిండా నుంచి గుర్మీత్ సింగ్ కుడియా, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, పాటియాలా నుంచి బల్బీర్ సింగ్ పోటీ చేయనున్నారు. ఫతేఘర్ సాహిబ్ సీటు నుంచి గురుప్రీత్ సింగ్ జీపీని రంగంలోకి దించారు. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఆయన ఈమధ్యే ఆప్లో చేరారు. ఫరీద్కోట్ స్థానం నుంచి పంజాబీ నటుడు కరంజిత్ అన్మోల్ పోటీలో ఉన్నారు.
Aam Aadmi Party releases a list of 4 candidates for upcoming Lok Sabha elections, in Punjab.
Jagdeep Singh Kaka Brar to contest from Ferozpur, Amansher Singh (Shery Kalsi) from Gurdaspur, Pawan Kumar Tinu from Jalandhar and Ashok Parashar Pappi from Ludhiana. pic.twitter.com/te8OtWaeBZ
— ANI (@ANI) April 16, 2024
Also Read…
Delhi Airport | ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. టాప్టెన్లో నిలిచిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
Aishwarya Rajinikanth | ధనుష్ – ఐశ్వర్య జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు
Srinagar | జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి