Aishwarya Rajinikanth | తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)కు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు ఇచ్చింది. విడాకుల విషయంలో అక్టోబర్ 7న ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
రెండేళ్ల క్రితం ధనుష్-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే వీరు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai family court)కు దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 13బీ కింద సరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్టోబర్ 7న ధనుష్ – ఐశ్వర్య ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు పంపింది.
కాగా, ధనుష్-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య.. 2004 నవంబర్ 18న ధనుష్ను వివాహం చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. డివోర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాలలో కనిపించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తున్నట్లు తమిళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Also Read..
Salman Khan | సాల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Mamitha Baiju | తెలుగులో అరంగేట్రానికి సిద్ధం?.. విజయ్ దేవరకొండ సరసన మలయాళీ సోయగం మమితా బైజు!
Mahesh Babu | సర్ప్రైజ్ల సమాహారం.. హనుమంతుడి ప్రేరణగా మహేశ్ పాత్రను డిజైన్ చేసిన రాజమౌళి!