Mamitha Baiju | ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను దోచుకుంది మలయాళీ సోయగం మమితా బైజు. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో కూడా భారీ ఆఫర్లొస్తున్నాయట.
తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సరసన మమితా బైజు నటించనుందని వినికిడి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. కొద్ది మాసాల క్రితం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తొలుత ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకున్నట్లు తెలిసింది. ఇప్పుడా స్థానంలో మమిత బైజుని కథానాయికగా ఖరారు చేయబోతున్నారని సమాచారం.