Srinagar | జమ్మూ కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని జీలం నది (Jhelum river)లో పడవ బోల్తాపడింది (Boat Overturns). ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు సహాయ దళం వెంటనే అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది నీటిమట్టం పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని సైతం అధికారులు మూసివేశారు.
#WATCH | J&K: A boat capsized in River Jhelum at Gandbal. SDRF team deployed. More details awaited: Disaster Management, J&K pic.twitter.com/hOAKvNCYtT
— ANI (@ANI) April 16, 2024
#WATCH | J&K: Search and rescue operation underway after a boat capsized in River Jhelum at Gandbal, Srinagar
More details awaited. https://t.co/WDU0ggiMA4 pic.twitter.com/67QKjm0WoJ
— ANI (@ANI) April 16, 2024
Also Read..
Odisha | ఫ్లైఓవర్ పైనుంచి పడిన బస్సు.. ఐదుగురు మృతి
Loksabha Polls: హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు.. వీడియో
Bhadrachalam | భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు.. నేడు ఎదుర్కోలు