బీజాపూర్: తొలి దశ లోక్సభ ఎన్నికలకు చత్తీస్ఘడ్ ప్రిపేరవుతున్నది. ఆ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏప్రిల్ 19వ తేదీన జరిగే తొలి దశ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది సిద్ధం అవుతున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్లలో వెళ్తున్నారు. బీజాపూర్, నారాయణ్పూర్ నుంచి హెలికాప్టర్లలో సిబ్బందిని తరలిస్తున్నారు. చత్తీస్ఘఢ్లో మొత్తం 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటికి మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన కేవలం బస్తర్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నిక జరగనున్నది.
#WATCH | Chhattisgarh: Ahead of Lok Sabha elections, polling teams leave by helicopter to Naxal-hit areas, in Narayanpur
11 Lok Sabha seats in Chhattisgarh will go to polls in three phases on April 19, April 26 and May 7. Bastar will be the only seat to go to polls in the first… pic.twitter.com/y8HN5WXMQX
— ANI (@ANI) April 16, 2024