Aadhaar | రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్కార్డు (Aadhaar card) ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఓటర్ల (voters)కు ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తెలిపింది. ఓటరు కార్డు (voter id) కానీ, లేదంటే, చెల్లుబాటు అయ్యే మరేదన్నా గుర్తింపు కార్డు చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టతనిచ్చింది.
పశ్చిమబెంగాల్లో వేల సంఖ్యలో ఆధార్ కార్డులను పనికిరాకుండా చేస్తున్నారంటూ తృణమూల్ (Trinamool Congress) ఎంపీలు సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ స్పష్టతనిచ్చారు. ఆధార్ కార్డు లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని టీఎంసీ బృందానికి తెలిపారు.
Also Read..
Basavaraj Patil | కాంగ్రెస్కు మరో షాక్.. పార్టీని వీడుతున్న కీలక నేత
mohammed shami | షమీకి శస్త్రచికిత్స విజయవంతం.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ క్రికెటర్