న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నప్పటికీ రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. శుక్రవారం కూడా కొత్తగా 20,80,048 మంది నుంచి శాంపిళ్లను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 34 కోట్ల మార్కును దాటి.. 34,11,19,909కి చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఈ గణాంకాలను వెల్లడించింది.