నల్లగొండ, మే 15: లాక్డౌన్ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీని మూడ్రోజులు పొడిగించారు. ప్రతి నెలా 18 వరకే బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 11 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు తీస్తున్నారు. అందువల్ల కార్డుదారులు ఇబ్బంది పడకుండా డీలర్లు మరో మూడ్రోజులపాటు ఈ నెల 21 వరకు పంపిణీ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు.