ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం
దెబ్బతిన్న పంటలు.. కూలిన ఇంటి పైకప్పులు..
నేలరాలిన మామిడి కాయలు.. విరిగిపడిన చెట్లకొమ్మలు..
నార్నూర్/జైనూర్, ఏప్రిల్ 13 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కురియడంతో పంటలు దెబ్బతి న్నాయి. చెట్లకొమ్మలు విరిగిపడగా.. మామిడికాయలు నేలరాలాయి. కొన్నిచోట్ల ఇంటిపైకప్పులు లేచిపోగా.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలుమండలాల్లో మంగళవారం ఉదయం ఆకాల వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమ య్యాయి. బోథ్ మండలంలోని కౌఠ (బీ) గ్రామంలోని ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. అదే మండలంలోని ధ న్నూర్ (బీ) గ్రామానికి చెందిన గజ్జె గంగారెడ్డికి చెందిన బర్రె పిడుగుపాటుతో మృతి చెందింది. ఉట్నూర్ మండలకేంద్రంతో పాటు దంతన్పెల్లి, బీర్సాయిపేట్, ఘన్పూర్, గంగన్నపేట్, గంగాపూర్ గ్రామాల్లోని తోటలోని మామిడికాయలు నేలరాలాయి. గతేడాది పూత, కాత లేక నష్టపోయామని, ఈ యేడు మం చిగా ఉన్నప్పటికీ గాలివానకు కాయలు రాలిపోవడంతో అనుకున్న దిగుబడి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంబి మండలానికి చెందిన కుర్మ రాజేందర్ అనే రైతుకు చెందిన రెండెకరాల మ క్క పూర్తిగా నేలకొరిగింది. మండలకేంద్రంలో భారీ వేప చెట్టు ఓ ఇం టిపై కూలింది. పలుచోట్ల ఇంటి పైకప్పులు లేచిపోయి కరంట్ వైర్లు తెగిపడగా, పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
పుకార్లపై స్పందించిన జెర్సీ డైరెక్టర్..!
నిర్మాతగా రవితేజ..హీరో ఎవరో తెలుసా..?
‘గని’ నుంచి వరుణ్-సయీ రొమాంటిక్ పోస్టర్