హైదరాబాద్: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ (33) శనివారం గుండెపోటుతో అకాల మరణం చెందాడు. అశ్విన్ యాదవ్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా 2007లో మొహాలీలో పంజాబ్తో జరిగిన మ్యాచ్ ద్వారా అశ్విన్ యాదవ్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ను మొదలు పెట్టారు.
మొత్తం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ యాదవ్ 34 వికెట్లు తీశాడు. 2008-09 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 52 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అతని కెరీర్లో అదే అత్యుత్తమ ప్రదర్శన. అశ్విన్ యాదవ్ 2009లో ముంబైతో ఆఖరి రంజీ మ్యాచ్ ఆడాడు. కాగా, అశ్విన్ యాదవ్ మృతికి భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సంతాపం తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..