న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం వాహనం ఢీకొని మున్సీలాల్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. ఢిల్లీలోని అల్ కౌసర్ పికెట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న మున్సీలాల్ను వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. తలంగా బలంగా గాయాలు కావడంతో తోటి పోలీసులు ఆయనను ఎయిమ్స్ ఆస్పత్రిలోని ట్రామ్ కేర్ సెంటర్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, మున్సీలాల్ను వాహనంతో ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై నిందితుడిని ఆరా తీయగా తన భార్యకు కరోనా పాజిటివ్గా తేలిందని, ఆమెను ఆస్పత్రిలో చేర్చి ఇంటికి వెళ్తుండా ప్రమాదం జరిగిందని చెప్పాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో తాను నిద్ర మత్తులో ఉన్నానని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నన్ను భారత్కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ