బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజల బతుకులు చితికిపోతున్నాయి. ఆర్థిక నష్టాలకు తోడు ప్రాణ నష్టాలు కూడా పెద్ద సంఖ్యలోనే సంభవిస్తున్నాయి. కరోనాతో పోరాటంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే.. కరోనా సోకిందని తెలిస్తే భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. ఇలాంటి హృదయవిధారక ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఇలాంటి దయనీయ ఘటనే చోటుచేసుకున్నది. ఇటీవల ఓ 61 ఏండ్ల వృద్ధుడికి కరోనా సోకడంతో కుటుంబసభ్యులు విజాయ్నగర్ ఏరియాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కుటుంబంతో ఎడబాటును తట్టుకోలేక గత రాత్రి ఆ వృద్ధుడు ఆస్పత్రి గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఉసురుతీసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..