లక్నో: బస్సు ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం కిందకు దిగారు. వేగంగా వచ్చిన కంటైనర్ ఆ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. (Uttar Pradesh Tragedy) ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న బస్సు మధుర ఎక్స్ప్రెస్వేపై రోడ్డుపక్కగా ఆగింది. కొందరు ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం బస్సు నుంచి కిందకు దిగారు.
కాగా, వేగంగా వచ్చిన కంటైనర్ వెనుక నుంచి ఆ బస్సును ఢీకొట్టింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు.
అయితే బస్సును గ్రీన్జోన్లో ఆపకపోవడం ఈ ప్రమాదానికి కారణమని పోలీస్ అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం తర్వాత కంటైనర్ను వదిలి పారిపోయిన డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
Also Read:
SIR Row | ఆసుపత్రి మార్చురీలో భార్య, కుమారుడి మృతదేహాలు.. ‘సర్’ విచారణకు హాజరైన వ్యక్తి
defence officials bribe | లంచం తీసుకున్న రక్షణ శాఖ అధికారులు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సీబీఐ