ముంబై: రైలులో అక్రమంగా తరలిస్తున్న 59 మంది పిల్లలను ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. మానవ అక్రమ రవాణాకు (Human Trafficking) సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన 59 మంది చిన్నారులను దానాపూర్-పూణే ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఒక ఎన్జీవో సంస్థ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం ఆ రైలు భుసావల్ స్టేషన్కు చేరిన వెంటనే అన్ని కంపార్ట్మెంట్లను తనిఖీ చేశారు. తొలుత ఆ స్టేషన్లో 29 మంది పిల్లలను రక్షించారు. ఆ తర్వాత మన్మాడ్ స్టేషన్కు ఆ రైలు చేరగా మరో 30 మంది పిల్లలను కాపాడారు.
కాగా, ఎనిమిది నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న 59 మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎన్జీవో సిబ్బంది, పోలీసుల సహకారంతో పిల్లల అక్రమ రవాణాను అరికట్టినట్లు ఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది.
#RPF @BBAIndia, PRAYAS with state police came together to bust a #ChildTrafficking ring, leading to the rescue of 59 children with arrest of 5 traffickers at Bhusawal and Manmad stations.
A powerful collaboration making a tangible difference in the fight against exploitation. pic.twitter.com/CJRv2fmlt6
— RPF INDIA (@RPF_INDIA) May 31, 2023