శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను (pics of terrorists) భద్రతా దళాలు విడుదల చేశాయి. సీసీటీవీ ఫుటేజ్ నుంచి సేకరించిన ఈ ఫొటోల్లోని ముగ్గురు ఉగ్రవాదులను కూడా గుర్తించారు. పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాకిస్థాన్ ఉగ్రవాది హడూన్ (హదూన్), కోడ్ నేమ్ ఉన్న నిషేధిత లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జాగా గుర్తించారు.
కాగా, ముగ్గురు ఉగ్రవాదులు అత్యంత శక్తి వంతమైన ఆయుధాలు వినియోగించినట్లు కూడా గుర్తించారు. అసాల్ట్ రైఫిల్స్, అమెరికా తయారీ ఎం4లు, రష్యా తయారీ ఏకే-47లను వారు ఉపయోగించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఫొటోలో బ్రౌన్ షాల్, నారింజ బ్యాగ్తో కూడిన పఠానీ సూట్ ధరించిన హమ్జా అరెస్టు కోసం సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.