కోల్కతా: పశ్చిమబెంగాల్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోరందుకున్నది. ఓటర్లు భారీగా క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బహెలా తూర్పు నియోజకవర్గంలో సైతం పోలింగ్ సరళి ఊపందుకున్నది. ఈ నేపథ్యంలో బెహలా తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పాయల్ సర్కార్ ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని చెబుతున్నారు.
బహెలా నియోజకవర్గంలో మహిళల ఓట్లే 57 శాతం ఉన్నాయని, ఆ ఓట్లన్నీ తనకే పడుతాయని పాయల్ ధీమా వ్యక్తంచేశారు. అదేవిధంగా నియోజవర్గ ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తు ఉన్నదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని పాయల్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్