Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 58 లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ పోలింగ్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 70.19 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత జార్ఖండ్లో 54.34 శాతం, బీహార్లో 45.21 శాతం, హర్యానాలో 46.26 శాతం, జమ్మూ కశ్మీర్లో 44.41 శాతం, ఢిల్లీలో 44.58 శాతం, ఒడిశాలో 48.44 శాతం, ఉత్తరప్రదేశ్లో 43.95 శాతం మేర పోలింగ్ నమోదైంది.
ఇవాళ ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్తోపాటే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కూడా జరుగుతున్నది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో తొలి రెండు దశల్లో 105 స్థానాలకు పోలింగ్ జరగ్గా మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జార్ఖండ్లోని గండీ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. గండి నుంచి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ జేఎంఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
#LokSabhaElections2024 | 49.2% voter turnout recorded till 3 pm, in the 6th phase of elections.
Bihar- 45.21%
Haryana- 46.26%
Jammu & Kashmir- 44.41%
Jharkhand- 54.34%
Delhi- 44.58%
Odisha- 48.44%
Uttar Pradesh-43.95%
West Bengal- 70.19% pic.twitter.com/CnEFFL3nUt— ANI (@ANI) May 25, 2024
Also Read..
Weather Report | మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన రైతుపవనాలు..!
Hardhik Pandya | భార్యతో విడాకులు.. 70 శాతం సంపద పోయినట్టేనా..?
CEC Rajiv Kumar | సందేహాల వాతావరణాన్ని సృష్టించే యత్నం.. పోలింగ్ డేటా వివాదంపై సీఈసీ రాజీవ్ కుమార్