Jammu Kashmir | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లో భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా (Kupwara) లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు.
కుప్వారాలోని మచల్ సెక్టార్ లో గల నియంత్రణరేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
కాగా, జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.
In a joint operation, Army and Police have killed four #terrorists in Kala Jungle of Machhal sector in #Kupwara who were trying to infiltrate to our side from POJK.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 23, 2023
Also Read..
YouTube | డౌన్ అయిన యూట్యూబ్.. వేలాది మందికి నిలిచిన సేవలు
Titan submersible | పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్.. ఐదుగురు పర్యాటకులు జలసమాధి