Nirmala Sitharaman | భారీ వర్షాలకు సంభవించిన వరదల కారణంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
అదేవిధంగా వరదల కారణంగా అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి తక్షణ సాయం కింద రెండు విడతలుగా రూ.900 కోట్ల నిధులు ఇచ్చినట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్పై నిర్మలమ్మ తీవ్ర విమర్శలు చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రం అల్లాడుతుంటే సీఎం స్టాలిన్ మాత్రం అవేవీ పట్టనట్టు ఢిల్లీ పర్యటనలో ఉన్నారని విమర్శించారు. ఇంతటి భారీ విపత్తు సమయంలో కూడా ‘ఇండియా’ కూటమితో కలిసి ఢిల్లీలో ఉన్నారంటూ మండిపడ్డారు.
Also Read..
Triple Talaq | సోదరుడికి కిడ్నీదానం చేసిన మహిళ.. వాట్సాప్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
DGP Ravi Gupta | న్యూఇయర్ వేళ అప్రమత్తంగా ఉండండి.. డీజీపీ రవిగుప్తా ఆదేశాలు