న్యూఢిల్లీ: ముగ్గురు బాలురు కలిసి 8 ఏళ్ల బాలికను గోడౌన్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. వరుసగా రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. (minors rape girl) నిందితులైన ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఓఖ్లా ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలురు కలిసి 8 ఏళ్ల బాలికను ఆశ పెట్టారు. మార్చి 12, 13న బాలిక ఇంటి సమీపంలో ఉన్న గోదాములోకి ఆమెను తీసుకెళ్లారు. ఆ రెండు రోజులు పగటి వేళ ఆ గోదాంలో బాలిక లోదుస్తులు విప్పి ముగ్గురు బాలురు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, మార్చి 14న పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మహిళా పోలీస్ అధికారిణితో కూడిన పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేసింది. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన ముగ్గురు బాలనేరస్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిని జువినెల్ హోమ్కు తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్
drunk man urinates on woman | ఆటోలో వెళ్తూ మహిళపై మూత్ర విసర్జన చేసిన తాగుబోతు.. కొట్టి చంపిన జనం
Watch: బైక్ రేస్లో.. స్కూటీని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్, విద్యార్థి మృతి