bus falls into gorge | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది (bus falls into gorge). ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
బస్సు 27 మంది ప్రయాణికులతో అల్మోరా (Almora) నుంచి హల్ద్వానీకి వెళ్తోంది. భీమ్తల్ (Bhimtal) నగర సమీపంలోని రాగానే బస్సు ఓ వంపు వద్ద అదుపుతప్పి 1,500 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 24 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 15 అంబులెన్స్లు ఘటనాస్థలికి చేరుకొన్నాయి. క్షతగాత్రులను రోప్ల సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Uttarakhand | A team of SDRF team is carrying out a rescue operation at the Bhimtal bus accident site along with local police and the Fire Department pic.twitter.com/cqvFvFjzNy
— ANI (@ANI) December 25, 2024
Also Read..
Ken-Betwa River Linking: కేన్-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన
Delhi CM | ఆ పబ్లిక్ నోటీసులు తప్పుడువి.. ఇదంతా బీజేపీ కుట్ర : ఢిల్లీ సీఎం అతిషి
Atal Bihari Vajpayee | వాజ్పేయీ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల