Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో ఘోర అగ్నిప్రమాదం (Fire Breaks) సంభవించింది. లోఖండ్వాలా కాంప్లెక్స్ (Lokhandwala Complex)లోని ఓ నివాస భవనంలో మంటలు చెలరేగి.. ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంధేరీ (Andheri) ప్రాంతంలోని లోఖండ్వాలా కాంప్లెక్స్ వద్ద 4వ క్రాస్ రోడ్డులో ఉన్న 14 అంతస్తుల (14-Storey Building) రియా ప్యాలెస్లో (Riya Palace building) బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భవనంలోని 10వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మృతులు చంద్రప్రకాశ్ సోని (74), కంఠ సోని (74), పెలుబేట (42) గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Rajiv Kumar | హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు తప్పిన పెను ప్రమాదం
DA | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 3 శాతం పెంపు..!
Nayab Singh Saini | శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నయాబ్ సింగ్ సైనీ.. రేపే సీఎంగా ప్రమాణం