Jammu Kashmir | జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకూ 26.72 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది.
అనంత్నాగ్లో 25.55 శాతం, దోడాలో 32.30 శాతం, కిస్త్వార్లో 32.69 శాతం, కుల్గాంలో 25.95 శాతం, పుల్వామాలో 20.37 శాతం, రాంబన్లో 31.25 శాతం, షోపియాన్లో 25.96 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏడు జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తొలి విడుతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది.
Jammu and Kashmir 1st phase Assembly elections: 26.72% voter turnout recorded till 11 am in Jammu and Kashmir, as per the Election Commission of India
Anantnag-25.55%
Doda- 32.30%
Kishtwar-32.69%
Kulgam-25.95%
Pulwama-20.37%
Ramban-31.25%
Shopian-25.96% pic.twitter.com/VRFWB182rp— ANI (@ANI) September 18, 2024
Also Read..
PM Modi | ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయండి.. జమ్మూ ఓటర్లకు మోదీ పిలుపు
building collapses | ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Donald Trump: ప్రధాని మోదీని కలుస్తా: డోనాల్డ్ ట్రంప్