Mizoram | మిజోరం (Mizoram) రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిన (Railway Bridge Collapses) ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. ఐజ్వాల్ (Aizawl)కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు 22 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. కూలిపోయిన ఉక్కు నిర్మాణం కింద ఉన్న మరో నాలుగు మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భైరవి-సాయిరాంగ్ (Bhairavi-Sairang) కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ ( New Railway Line project)లో భాగంగా కురుంగ్ నదిపై ఆ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో దాదాపు 40 మంది కార్మికులు ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
Also Read..
Gadar 2 | రూ.400 కోట్లు దాటిన గదర్ 2.. ఫ్యాన్స్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సన్నీ డియోల్
Serena Williams | రెండోసారి తల్లైన సెరెనా విలియమ్స్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రయోగంలో ఆ 20 నిమిషాలు ఎందుకు అంత కీలకం ?