Marathon | తమిళనాడు మధురై (Madurai)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన మారథాన్ (Marathon) పరుగులో పాల్గొని గుండెపోటు (heart attack)తో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధురైలో ఆదివారం ఉయదం ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ (Uthiram 2023 blood donation marathon) పరుగును నిర్వహించారు. ఈ పరుగును తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ( Ma Subramanian ), వాణిజ్య పన్నులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి మూర్తి ( P Moorthy) జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ లో పాల్గొన్న కల్లకురిచికి చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ (Dinesh Kumar ).. పరుగును విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం ఓ గంట పాటు బాగానే ఉన్న దినేశ్.. ఆ తర్వాత అసౌకర్యానికి గురై విశ్రాంతి గదిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో దినేశ్ కు మూర్చ రావడంతో గుర్తించిన అతడి స్నేహితులు దినేశ్ ను సమీపంలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు బాధితుడికి కృత్రిమ శ్వాస, ప్రాణధార చికిత్స ప్రారంభించారు. అయితే, ఆసుపత్రిలో చేరిన గంట తర్వాత దినేశ్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దినేశ్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Cattle | వానకాలం.. పశువులు పైలం.. పోషకులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే..!
Natural Satellite of Earth | భూవాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నది ఎవరో తెలుసా..?