న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న 300కు పైగా మరణాలకు కలుషిత ఔషధాలు, దగ్గు సిరప్లు కారణమని భావిస్తున్న నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కీలక నిర్ణయం తీసుకొన్నది. భారత్తో సహా ఇండోనేషియాలో తయారైన 20 రకాల సిరప్లు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నది. ఈ జాబితాలో భారత్కి చెందిన ఫార్మా సంస్థల్లో తయారైన ఏడు సిరప్లు ఉన్నాయి. ఇందులో దగ్గు మందులు, విటమన్ ఔషధాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్వో అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.