Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా దంతెవాడ (Dantewada) జిల్లాలో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు, ఓ మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు.
బార్సుర్ పల్లి సమీపంలో మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు పెట్టినట్లు పోలీసులకు శనివారం సమాచారం అందింది. దీంతో వాటిని తొలగించేందుకు 195 బెటాలియన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బార్సుర్పల్లి సమీపంలో పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం.. 6,000 మందికి ఆహ్వానాలు
Earthquake | బంగ్లాదేశ్ను వణికించిన భారీ భూకంపం.. పశ్చిమబెంగాల్లోనూ ప్రకంపనలు
Animal Movie | ‘యానిమల్’ సందడి.. థియేటర్లో టపాసుల మోత మోగించిన ఫ్యాన్స్