Rains | రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో గురువారం ఉదయం వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.5 డిగ్రీలు కాగా, గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)తెలిపింది. ఇన్ని రోజులూ తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు తాజా వర్షాలు ఉపశమనం కలిగించినట్లవుతోంది. అయితే వర్షం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Waterlogging witnessed in several parts of Delhi after the rainfall
(Visuals from Sarai Kale Khan area) pic.twitter.com/gfa7h0ytb3
— ANI (@ANI) June 29, 2023
మహారాష్ట్ర ముంబైలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా ప్రాణ నష్టం సంభవించింది. బుధవారం ముంబైలోని మలాద్ ప్రాంతంలో చెట్టు కూలి కౌశల్ దోషి (38) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గత 24 గంటల్లో మహారాష్ట్రలోని థానే, పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరదలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు చెప్పారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
Moderate rainfall continues to occur over Mumbai since forenoon of yesterday as shown in the attached Mumbai Radar Image.
It is likely to continue during next 3 hours. Extremely Heavy rainfall has occurred at isolated stations and very heavy at some stations during last 21 hours pic.twitter.com/YUVkAOKaPy
— India Meteorological Department (@Indiametdept) June 29, 2023
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి ఆ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100కి పైగా రహదారులు మూసివేసినట్లు చెప్పారు. బుధవారం భద్రాష్ – రోహ్రు లింక్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనం వర్షం కారణంగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అటు గుజరాత్ రాష్ట్రాన్నీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే బిపర్ జాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన గుజరాత్ లో ఇప్పుడు రుతుపవనాల ప్రభావంతో మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో దక్షిణ గుజరాత్ లోని నవ్సారి, వల్సాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక ఉత్తరాఖండ్ నూ గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జులై 5వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో డెహ్రాడూన్ తో పాటు ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రుతుపవనాల ప్రభావంతో గోవా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది.
Also Read..
Madonna | తీవ్రమైన ఇన్ ఫెక్షన్ తో ఆసుపత్రి పాలైన పాప్ సింగర్
RRR | ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్ జ్యూరీ సభ్యులుగా చరణ్, ఎన్టీఆర్
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్