Sajjan Kumar : తండ్రీకొడుకులను తగులబెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ ఎంపీ (Former MP) సజ్జన్ కుమార్ (Sajjan Kumar) కు జీవిత ఖైదు పడింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue court) ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా (Justice Kaveri Baweja) సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు.
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన ఒక కేసులో సజ్జన్ కుమార్ ఇప్పటికే జీవితఖైదు అనుభవిస్తున్నారు. అదే అల్లర్ల సందర్భంగా 1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి నగర్లో సిక్కుమతస్తులైన తండ్రీకొడుకులు ఇద్దరినీ తగులబెట్టి సజీవదహనం చేశారు. ఈ కేసులో కూడా నిందితుడిగా ఉన్న సజ్జన్ కుమార్ను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 12న దోషిగా తేల్చింది. ఇవాళ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అందుకు ప్రతీకారంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 1న ఢిల్లీలో తండ్రీ కొడుకులైన జశ్వంత్ సింగ్, తరుణ్దీప్ సింగ్ ఇంటిపై పలువురు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇల్లును లూటీ చేశారు. ఆపై ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఇంట్లోని తండ్రీకొడుకులు సజీవదహనమయ్యారు. జశ్వత్సింగ్ భార్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదైంది.
జశ్వంత్ ఇంటిపై దారుణానికి పాల్పడిన అల్లరి మూకలో సజ్జన్ కుమార్ కేవలం ఒక సభ్యుడిగా మాత్రమే ఉండలేదని, ఆ మూకకు అతను నాయకత్వం వహించాడని తీర్పు సందర్భంగా జస్టిస్ కావేరీ బవేజా వ్యాఖ్యానించారు. అతడు చేసిన నేరానికి గరిష్ఠ శిక్ష అయిన మరణదండన విధించాలని, కానీ తీహార్ జైల్లో అతని సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని కనిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధిస్తున్నామని పేర్కొన్నారు.
Gulkand | మీకు గుల్కండ్ గురించి తెలుసా..? దీన్ని రోజూ తింటే.. ఎన్నో లాభాలు..!
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం తప్పు.. బీజేపీకి తమిళ నటి రాజీనామా
Encounter | పంజాబ్లో ఎన్కౌంటర్.. దుండగుల కాళ్లలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్లు.. Video