బెంగళూరు: ఆరుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang Raped) వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. మరోసారి ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటకలోని బెలగావిలో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల బాలికను ఆమె స్నేహితుడు ఆరు నెలల కిందట బెలగావి శివార్లలోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఆ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు.
కాగా, ఈ వీడియోతో బాలికను ఆ వ్యక్తి బ్లాక్మెయిల్ చేశాడు. అక్కడకు రాకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించాడు. మళ్లీ ఆ ప్రాంతానికి ఆమెను రప్పించాడు. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డాడు. మరోసారి దీనిని రికార్డ్ చేశాడు. పదేపదే ఆమెను బెదిరించసాగాడు.
మరోవైపు విసిగిపోయిన ఆ బాలిక మే 31న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగతా నలుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: