ఆత్మకూరు(ఎం), ఏప్రిల్13: ప్లవ నామ సంవత్సరం ఉగాది వేడుకలను మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల్లో నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని దేవాల యాల్లో భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
తుర్కపల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామాల్లో ప్రజలు ఇండ్లలో తీపి వంటలు, షడ్రుచులతో మిలితమైన ఉగా ది పచ్చడిని చేసి దేవునికి నైవేద్యం సమర్పించారు. ఆలయాలు ప్రధాన కూడళ్లల్లో పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించ గా ప్రజలు శ్రద్ధగా ఆలకించారు.
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఉగాది సంబురాలు ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. రామాజీపేట, వంగపల్లి గ్రామాల్లో మా రుతి పవన్కుమార్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వ హించారు. వంగపల్లి అమ్మ ఒడి అనాథాశ్రమంలో నిర్వాహ కుడు శంకర్ ఉగాది పచ్చడి వితరణ చేశారు.
బొమ్మలరామారం: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామా ల్లో మంగళవారం ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘ నంగా నిర్వహించారు. దేవాలయాలను అలంకరించి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు అరుణ, మహేశ్ గౌడ్, శ్రీనివాస్, దామోదర్ గౌడ్, శంకర్ గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.రాజాపేట: మండలంలోని అన్ని గ్రామాల్లో తెలుగు సంవత్స రాది ఉగాది పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించా రు. ప్రజలు అలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వ హించి ఉగాది పచ్చడి సేవించారు. అనంతరం వేద పండితులు ఆలయాల్లో పంచాగం పఠనం గావించారు.
ఆలేరురూరల్: ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళ వారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉగాది వేడుకలు జరు పుకున్నారు. మహిళలు తమ ఇండ్ల ఎదుట రంగు రంగుల ము గ్గులు వేసి తెలుగు సంవత్సరానికి స్వాగతం పలికారు. షడ్రు చుల సమ్మేళనమైన పచ్చడిని ఆరగించారు. పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.మోటకొండూర్: మండలంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రజలు సాంప్రదాయంగా ఇండ్లను మామిడి తోరణాలతో అల కరించుకున్నారు.గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు ని ర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కా ర్యాలయంలో సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో పంచాంగ పఠనా న్ని పురోహితులు నిర్వహించారు.
గుండాల: మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఉ గాది వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ సందడి కనిపించింది. ఉగాది పచ్చ డి చేసుకుని సేవించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు.