తిరువనంతపురం: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు విజృంభిస్తుండటంతో కేరళలో నైట్ కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీపీ జాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నైట్ కర్ఫ్యూను రేపు రాత్రి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే ఏప్రిల్ 20 నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వేళలు అమల్లో ఉండనున్నాయి. కాగా, కేరళలో ఆదివారం ఒక్కరోజే 18,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 12.39 లక్షలకు చేరింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కేరళ సర్కారు ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మాకు మెడిసిన్ పనిచేయదు.. పెగ్గే పని చేస్తుంది.. వీడియో
బావ ముఖేశ్కు బర్త్డే విషెష్ చెప్తూ టీనా అంబానీ పోస్ట్..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య