బంజారాహిల్స్, మార్చి 19 : జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా శుక్రవారం ఉదయం స్వామి వారి రథోత్సవం కన్నుల పం డువగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామి వారిని దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ కవితకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. శోభాయమానంగా అలంకరించిన రథంలో స్వామి వారు మాడవీధుల్లో ఊరేగారు. సాయంత్రం సైతం స్వామి వారు అశ్వ వాహనంపై తిరు వీధుల్లో ఊరేగారు. వేడుకల్లో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.