యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, ధర్మారెడ్డిగూడెం జడ్పీ రోడ్డు నుంచి పెద్దకందుకూరు(వయా బాపేట, తాళ్లగూడెం) వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాసాయిపేట వద్ద ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు గొంగిడి సునితామహేందర్రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తొటకూరి అనురాధ, ఆయా గ్రామాల సర్పంచులు ఈదులకంటి భాస్కర్, కుండె పద్మ, బీమగాని రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య, గుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, నాయకులు తొటకూరి బీరయ్య, మిట్ట వెంకటయ్య, కవిడే మహేందర్, కొండం ఆశోక్రెడ్డి, కసావు శ్రీనివాస్, గుణగంటి బాబురావు, బీమగాని నర్సింహ, బండ సిద్దులు, ఆరె శ్రీనివాస్, ఆవుల సాయి పాల్గొన్నారు.