యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్నారు. శుక్రవారం స్వర్ణతాపడానికి పలువురు దాతల నుంచి రూ. 1.38,116 నగదు స్వామివారికి సమకూరింది.
భువనగిరి పట్టణానికి చెందిన లక్ష్మీనర్సింహగౌడ్ రూ. 25,000, నర్సింగరావు రూ. 11,116 హైదరాబాద్కు చెందిన దుర్గా ప్రసాదరావు రూ. 51,000, హబ్సిగూడకు చెందిన కందాడి జనార్దన్ రెడ్డి, వసుమతి దంపతులు రూ. 51,000 విరాళం సమర్పించారు. ఈ మేరకు నగదును బాలాలయంలో ఆలయ అధికారులకు అందజేశారు.