యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ ఇళ్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త గుండ్లపల్లికి గుండు అయిలయ్య రోజుమాదిరిగానే ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.
ఇంట్లో సుమారు రూ. 1. 50 లక్షల విలువగల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.