యాదాద్రి: యాదాద్రి కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేద మంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణం చేసి, ఆంజ నేయ స్వామి వారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభా తసేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండ పంలో లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తొలుత సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకా రజోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యపూజలు ఆలయ సంప్రదాయరీతిలో కొనసాగాయి.
స్వామిని దర్శించుకున్న శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి వేద ఆశీర్వచనం అందజేశారు.