మోత్కూరు, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్రామ్ మహనీయుడని, ఆయన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎం తగానో కృషి చేశారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మం దుల సామేలు అన్నారు. సోమవారం జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఆయన విగ్రహానికి మందుల సామేలు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కులరహిత సమాజంకోసం జగ్జీవన్రామ్ పోరాడార న్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్రాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ సర్పం చ్ పిచ్చయ్య, ఎంపీటీసీ జయశ్రీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్గౌడ్, ఉప్పలయ్య, దుర్గయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో..
దళిత, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. దళిత సంఘాల తాలుకా అధ్యక్షుడు చంద్రయ్య, మధు, అంజయ్య, మల్లేశ్, శ్రీరాములు, కొమురయ్య, సమ్మయ్య, నర్సింహ్మ, మత్స్యగిరి, నవీన్, మహేందర్, యాదగిరి, మల్లయ్య, శివ పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయంలో..
చౌటుప్పల్, ఏప్రిల్ 5 : పేదల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్రామ్ ఎంతగానో కృషి చేశారని ఆర్డీవో సూరజ్కుమార్ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో బాబూజగ్జీన్రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఆర్డీవో పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ పరిపాలనాధికారి శ్రీనివాస్, నయాబ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు,నరేశ్, మనోహర్, రాములు, శేఖర్, ప్రదీప్ పాల్గొన్నారు.
అనంతారంలో..
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 5: జగ్జీవన్రామ్ జయంతిని మండలంలోని అనంతారంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతారంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి సర్పంచ్ మల్లికార్జున్ పూలమాలవేసి నివాళులర్పించారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని మహిళా సంఘాల సభ్యుల కు, గ్రామస్తులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఉపసర్పంచ్ వెంకటేశ్, వార్డు సభ్యులు మీనారెడ్డి, మహేశ్, మల్లేశ్, చిన్నఅంజయ్య, శివ, వంశీ, వసుధ, రమ, జ్యోతి, శోభ, లింగలక్ష్మి పాల్గొన్నారు.
చౌటుప్పల్లో..
చౌటుప్పల్, ఏప్రిల్5 : జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు యువత కృషి చే యాలని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేవలమ్మనాగారంలో..
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్5 : దేవలమ్మనాగారం పంచాయతీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రె డ్డి, ఎంపీటీసీ రాజమ్మ, ఉపసర్పంచ్ హారి క, పంచాయతీ కార్యదర్శి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
బీబీనగర్లో..
బీబీనగర్, ఏప్రిల్5 : బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పు రస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్సీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీపీ సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ ప్రణీత పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, మహేశ్, అక్బర్, మోహన్రెడ్డి, ప్రవీణ్, జహంగీర్ పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ, ఏప్రిల్5: జగ్జీవన్రామ్ జయంతిని పురస్క రించుకుని సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రమేశ్రాజ్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో, స్థానిక శాఖ గ్రంథాలయంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ లలితాశ్రీనివాస్, ఎంపీటీసీ రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర, ఎంపీవో కేదారీశ్వర్, గ్రంథాలయ చైర్మన్ వెంకటరమణ, బీసీ సంఘం మండల అధ్యక్షుడు యాదగిరి, ఆంజనేయులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు, ఏప్రిల్5 : అడ్డగూడూరులో జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సర్పం చ్ బాలెంల త్రివేణి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇవీ కూడా చదవండి…
లాక్డౌన్ వద్దంటే.. మాస్క్ తప్పనిసరి