మోత్కూరు, ఏప్రిల్ 5: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యా క్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొ రేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రామకృష్ణారెడ్డి-పద్మ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కొవిడ్ను ఇప్పటికిప్పుడు అరికట్టే పరిస్థితి లేదని కేవలం వ్యాక్సిన్ మాత్రమే మన ముందున్న సువర్ణావకాశమన్నారు. కార్యక్ర మంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిశోర్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకాపై అవగాహన కల్పించాలి
బీబీనగర్: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకునేలా అవగా హన కల్పించాలని ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్ అధికారు లు, స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు. సోమవారం మండ ల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామ సెక్రటరీలు, ఆశ వర్కర్లు ప్రజలకు టీకాపై అవ గాహన కల్పించి వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గణేశ్ రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి, డా.ప్రవీణ్ కుమార్, దాక్షాయణి పాల్గొన్నారు.
కొవిడ్కు వ్యాక్సినే సరైన మార్గం
యాదాద్రి: కరోనా కట్టడికి కొవిడ్ వ్యాక్సినే సరైన మార్గమని మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్తో పాటు 20 మంది ఆర్టీసీ సిబ్బంది కొ విడ్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొవి డ్ టీకాపై వస్తున్న వదంతులు నమ్మొద్దని తెలిపారు. ఏలాంటి ఇతర సమస్యలు రావని అన్నారు. ప్రతి సోమ, మం గళ, గురు, శుక్రవారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేయించుకోవాలని తెలిపారు. బీపీ, షుగర్ ఇతర దీర్ఘ కాలిక జబ్బులు ఉన్నా తీసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో 86 కరోనా పాజిటివ్ కేసులు
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 5: జిల్లాలో సోమవారం ఒక్కరోజు 86 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.459 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 86 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, 45 సంవత్సరాలు నిండిన వారు టీకా తీసుకోవాలని డీఎంహెచ్ వో సాంబశి వరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో ఏడుగురికి పాజిటివ్
ఆత్మకూరు(ఎం): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7 గురికి పాజిటివ్గా నిర్ధారణ అయిన ట్లు మండల వైద్యాధికారిణి ప్రణీష తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో కూరెళ్లకు చెందిన ఇద్ద రు, ఆత్మకూరు(ఎం)కు చెందిన ఐదుగురు ఉన్నట్లు ఆమె తెలిపారు.
తుర్కపల్లిలో ఇద్దరికి కరోనా పాజిటివ్
తుర్కపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని, అదేవిధంగా 67 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి చంద్రా రెడ్డి తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
నెల్లికల్ ఎత్తిపోతల కేసీఆర్ పుణ్యమే