యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.