తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందజేస్తున్న 1.80లక్షల చేపపిల్లలను అదనపు కలెక్టర్ దీపక్తీవారీతో కలిసి ఆదివారం ఆమె మండలంలోని మాదాపురం గ్రామంలోని కొత్త, జగ్గ య్య చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రోత్సాహం తోనే మత్స్య కారులకు మంచి రోజులు వచ్చాయన్నారు.
సమైక్య రాష్ట్రంలో అనిచివేతకు గురైన కుల వృత్తులు స్వరాష్ట్రంలో తిరిగి ప్రాణం పోసుకున్నాయన్నారు. మీషన్కాకతీయ పథకం కింద ప్రభుత్వం కొట్లాది రూపాయలను వెచ్చించి చెరువుల పూడికతీత, వెడల్పు వంటి అభివృద్ధి పనులను చేప ట్టిందని వరునుడి కరుణతో చెరువులన్నీ జలకళను సంతరించుకోని మత్స్యకారులకు జీవానాధారం అయ్యాయన్నారు.
మత్స్య కారులకు సబ్సిడీ కింద ప్రభుత్వం ఆటోలు, వలలు డీసీఎం ద్విచక్ర వాహనాలను అందించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల , పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ఎంపీపీ ఎం. శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి తదితరులున్నారు.