రాజాపేట, మార్చి 07 : రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ చందా రమేశ్, గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలకు మైక్ సిస్టం అందజేసిన దాతకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట నరసమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కలకుంట్ల కవిత, ఉపాధ్యాయులు సోమ సత్తిరెడ్డి, ఎలగందుల వెంకటేశ్, జూకంటి కరుణాకర్, చింతకింది శ్రీనివాస్, కీర్తి సరిత, ఇండ్ల రామచందర్ పాల్గొన్నారు.