యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనంతో కుంకుమార్చన ప్రారంభమైంది.
మొదటి రోజు పూజల్లో భాగంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో గీత సంప్రదాయం ప్రకారం వాయినం సమర్పించారు.