రాజాపేట, మార్చి 02 : రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాల సిద్దులు ఇటీవల తాటిచెట్టు పైనుండి పడి మృతి చెందాడు. సిద్దులు రాజాపేట ఎస్బీఐ బ్యాంక్లో రూ.20 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తీసుకోగా ప్రమాద బీమా కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును బ్యాంక్ మేనేజర్ రవితేజ, సర్పంచ్ పులి రాజు నామిని అయిన సిద్ధులు భార్య స్వాతికి సోమవారం అందజేశారు.