భువనగిరి కలెక్టరేట్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సామాజిక దూరాన్ని పాటించి, మాస్కులను విధిగా ధరించి వేడుకల్లో పాల్గొనాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు.
ఈ మేరకు శుక్రవారం పారిశుధ్య సిబ్బంది కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య పనులను చేపట్టారు. కరోనా కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఆవిష్కరించి ప్రసంగాన్ని చేపట్టనున్నారు.