యాదగిరిగుట్ట , యాదాద్రి : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవోగా రామకృష్ణ రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం స్వామివారిని దర్శించుకుని ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన యాదాద్రి ఆలయానికి ఇన్చార్జి ఈవోగా పనిచేశారు. యాదాద్రి ఆలయ ఈవోగా పనిచేసిన గీత గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు.