వలిగొండ, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి తెలంగాణ ప్రజానీకం గోసపడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్ట నుండి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వల్లమాల్ల కృష్ణ, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసిన తెలంగాణలో వ్యవసాయం నాశనం అయిపోయి రైతులకు ఏడుపే మిగిలిందని, మహిళలు, కూలీలు, ఆటో కార్మికులు, యువజనులతో పాటు యావత్ తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతుందన్నారు. కేసీఆర్ పాలనే బాగుందని, కేసీఆర్ ఉంటే బాగుండేదని తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ 27వ తేదీన వరంగల్ మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి కేసీఆర్కు మరింత శక్తిని అందించి జయప్రదం చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుండి లక్షలాదిగా రజితోత్సవ మహాసభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షుడు గొంగడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, క్యామ మల్లేశం, పైళ్ల రాజవర్ధన్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, పడమటి మమతా నరేందర్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, కొమరెల్లి సంజీవరెడ్డి, డేగల పాండరీ, కునపురి కవిత, పల్చం రమేశ్, గూడూరు శేఖర్ రెడ్డి, జానీ అప్రోచ్, మద్దెల మంజుల పాల్గొన్నారు.
Valigonda : కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి గోసపడుతున్న ప్రజానీకం : జగదీశ్రెడ్డి